10 March, 2026 | 10:24 PM

మహిళలు అన్ని రంగాల్లోనూ ఆదర్శం

10-03-2026 08:37 PM

నంగునూరు,(విజయక్రాంతి): నంగునూర్ మండలం ఘనపూర్ గ్రామంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ జపా శ్రీకాంత్ మహిళలను ఘనంగా సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మహిళలు ప్రతి రంగంలోనూ తమ ప్రతిభను చాటుతూ ఉన్నత స్థానాలను అధిరోహిస్తు,ఆదర్శంగా నిలుస్తున్నారని ఆయన కొనియాడారు. ఈ వేడుకల్లో నాయకులు రాగుల సారయ్య,లింగం గౌడ్,రమేష్ గౌడ్,రాజు,సర్పంచ్ సాయిలు, ఉప సర్పంచ్, ఏపీఎం శ్రీనివాస్, సీసీలు ప్రేమలత, శ్రీనివాస్, లింగం, మల్లేశం, సేనాపతి, సిఏలు సులోచన, మాధవి, వీఓబీ రజిత, సుకన్య తదితరులు పాల్గొన్నారు.