లింగుపల్లి ఐకేపీ వడ్ల కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన జాయింట్ కలెక్టర్
05-05-2026 12:58 PM
దోమకొండ,(విజయ క్రాంతి): వడ్ల కొనుగోలు కేంద్రంనీ మంగళవారం సందర్శించిన జాయింట్ కలెక్టర్, రైతులకు కనీస మద్దతు ధర రావడానికి ప్రభుత్వం మహిళా సంఘాల ద్వారా వడ్ల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని జెయింట్ కలెక్టర్ పేర్కొన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఇబ్బందులు రాకుండా చూడాలి. మౌలిక సదుపాయాలు కల్పించాలి. ఎప్పటికీ అప్పుడు కంటా అయినవి రైస్ మిల్లులకు ట్రాన్స్పోర్ట్ చేసి, ట్యాబ్ ఎంట్రీ త్వరగా చేయాలని సెంటర్ సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో RI కిష్టయ్య , పంచాయతీ కార్యదర్శి, సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్, ఏ పీఎం శ్రీనివాస్, సీ సీ,VOA , సెంటర్ సిబ్బంది పాల్గొన్నారు.






