ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య
01-03-2026 01:30 AM
పరీక్షల భయంతో బలవన్మరణం
కామారెడ్డి జిల్లా శెట్టిపల్లి సంగారెడ్డిలో ఘటన
కామారెడ్డి, ఫిబ్రవరి 28 (విజయక్రాంతి): ఇంటర్ పరీక్షలు రాస్తు న్న ఓ విద్యార్థి పరీక్షలలో ఫెయిల్ అవుతా ననే భయంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం శెట్టిపల్లి సంగారెడ్డి గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. శెట్టిపల్లి సంగారెడ్డి గ్రామానికి చెందిన చాకలి శివకుమార్ (17) ఇంటర్ పరీక్షలు రాస్తున్నాడు. కొన్ని పరీక్షలు బాగా రాయలేదని బెంగతో పరీక్షలో ఫెయిల్ అవుతానేమోన న్న భయంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.




