11-02-2026 01:29:22 PM
మర్రిగూడ,(విజయక్రాంతి): మర్రిగూడ మండల కేంద్రంలో శ్రీ భవాని రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో గ్రామ సర్పంచ్ వీరమళ్ళ శిరీష లోకేష్ గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు రామదాసు శ్రీనివాస్ 58 వీధి లైట్లను మంజూరు చేయించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ... ఈ వీది లైట్లు మర్రిగూడలోని ప్రధాన రహదారి వీధుల్లో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రాత్రి సమయంలో ప్రజలకు మెరుగైన వెలుగు సౌకర్యం లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మాస నీలిమ చంద్రశేఖర్, ఎం సతీష్ గ్రామ, పోనుగోటి శేఖర్, మహమ్మద్ జమీర్, జర్పుల హనుమంతు, సిలివేరు కల్పన, రవి, తిరుమని అంజమ్మ, శ్రీను నాయక్, అమంచ రమేష్ ఉన్నారు.