11-02-2026 01:41:31 PM
హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం నుంచే ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ స్టేషన్ల దగ్గర క్యూ కడుతున్నారు. ఇదిలా ఉంటే మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా బుధవారం కొడంగల్ లోని జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓటు హక్కును వినియోగించుకున్నాను. ప్రజాస్వామ్య సౌధానికి పునాది ఓటు అని, ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి కోరుతున్నాను. ఓటు వేసిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ బయలుదేరారు. ఏడు నగరపాలక సంస్థల్లోని 412 డివిజన్లు, 116 పురపాలక సంఘాల్లోని 2,569 వార్డుల్లో పోలింగ్ జరుగుతోంది. ఉదయం 7 నుంచి 5 గంటల వరకు ఈ పోలింగ్ కొనసాగనుంది.