22 April, 2026 | 12:41 PM

Breaking News

కాళేశ్వరంపై నిందలు వేసి... కేసీఆర్ ప్రతిష్ట దెబ్బతీసేందుకు కుట్ర   •   కట్టుదిట్టమైన పర్యవేక్షణతో నాణ్యమైన రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలి   •   ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి   •   గంజి చంద్రమౌళి మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు   •   రేవంత్ రెడ్డి నిజస్వరూపం... హైకోర్టు తీర్పుతో తేటతెల్లం   •   పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి పొంగులేటి   •   దేశాయిపేటలో పారిశుద్ధ్యం అస్తవ్యస్తం   •   ఆర్టీసీ సమ్మె విరమించాలని మంత్రి పొన్నం విజ్ఞప్తి   •   TGSRTC Strike: ఆర్టీసీ సమ్మె ప్రభావం.. డిపోకే పరిమితమైన బస్సులు   •   కాళేశ్వరం కేసులో KCR, Harishలకు భారీ ఊరట: హైకోర్టు సంచలన తీర్పు   •  

కొడంగల్‌లో ఓటు వేసిన సీఎం రేవంత్‌

11-02-2026 01:41 PM

హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం నుంచే ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ స్టేషన్ల దగ్గర క్యూ కడుతున్నారు. ఇదిలా ఉంటే మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా బుధవారం కొడంగల్ లోని జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓటు హక్కును వినియోగించుకున్నాను. ప్రజాస్వామ్య సౌధానికి పునాది ఓటు అని, ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి కోరుతున్నాను. ఓటు వేసిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ బయలుదేరారు. ఏడు నగరపాలక సంస్థల్లోని 412 డివిజన్లు, 116 పురపాలక సంఘాల్లోని 2,569 వార్డుల్లో పోలింగ్ జరుగుతోంది. ఉదయం 7 నుంచి 5 గంటల వరకు ఈ పోలింగ్ కొనసాగనుంది.