ఇందిరమ్మ గృహప్రవేశం ఎంతో ఆనందం
28-02-2026 09:08 PM
జడ్చర్ల: మున్సిపల్ పరిధిలో గల 9వ వార్డు శంకరయ్యపల్లి తండాలో నేనావత్ కిషన్ లక్ష్మి నాయక్ దంపతులు నూతన ఇందిరమ్మ గృహప్రవేశం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్ పర్సన్ కోనేటి పుష్పలత, మున్సిపల్ కమిషనర్ లక్ష్మారెడ్డి, స్థానిక కౌన్సిలర్ చైతన్య చౌహన్, కుమ్మరి రాజు, వార్డ్ ఆఫీసర్, ఇందిరమ్మ కమిటీ సభ్యులు గోపాల్ నాయక్,కమలం శేఖర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కోనేటి నరసింహులు,దినేష్ నాయక్, గ్రామస్తులు కుటుంబ సభ్యులు పాల్గొనడం జరిగింది.




