ప్రతి ఒక్కరు SIR ప్రక్రియను సద్వినియోగించుకోవాలి
14-07-2026 04:26 PM
* ఎస్ఐఆర్ ప్రక్రియ బూతును పరిశీలించిన టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సంజీవ్ రావ్ పాటిల్
సిర్గాపూర్,(విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండల కేంద్రలోని SIR ప్రక్రియ బూతున్ సందర్శించిన బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు సంజీవ్ రావ్ పాటిల్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...అర్హులైన ప్రతి ఒక్కరూ తమ వివరాలను సక్రమంగా నమోదు చేసుకుని ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఫారాలను సమర్పించాలని సూచించారు. ఫారాల స్వీకరణ ప్రక్రియను అధికారులు పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ SIR ప్రక్రియను అందరూ వినియోగించుకోవాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.






