టీఆర్పీలో భారీగా చేరికలు
24-02-2026 12:00 AM
కండువా కప్పి ఆహ్వానించిన తీన్మార్ మల్లన్న
హైదరాబాద్, ఫిబ్రవరి 23 (విజయక్రాంతి): తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ హరిశంకర్గౌడ్ సమక్షంలో శేరిలింగంపల్లి నియోజకవర్గ నాయకులు పలువురు రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు బండారి రమేష్ యాదవ్, మహిళా అధ్యక్షురాలు విజయలక్ష్మి ఆధ్వర్యంలో గచ్చిబౌలి డివిజన్కు చెందిన మహిళలు, పురుషులు పెద్ద సంఖ్యలో తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరారు. రంగారెడ్డి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ నర్సింగ్ ముదిరాజ్, మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ గుళ్ల వాసుకి, నడమెట్టి చిట్టెమ్మ, కోట్ల సుకన్య, దయ్యాల శ్వేత, జి. రంగమ్మ, అమ్మిడిపల్లి అంజయ్య, బి. లలిత, జి. రవి కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.




