11 July, 2026 | 8:33 PM

Breaking News

జవహర్ నవోదయలో ప్రవేశాలకు ఆహ్వానం   •   గోపాల్ కుటుంబానికి అండగా ఉంటాం.. రూ.1 లక్ష ఆర్థిక సాయం: మాజీ మంత్రి కేటీఆర్   •   అంబేద్కర్ విగ్రహ ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధం   •   దివ్యాంగురాలిని ఆప్యాయంగా పలకరించిన జిల్లా కలెక్టర్   •   పినపాక మండలంలో ఎస్ఐఆర్ ప్రోగ్రామ్   •   శాతవాహన క్రీడా మైదానంలో 'సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్' నిర్మాణానికి భూమి పూజ   •   ఈనెల 13న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి భూపాలపల్లి జిల్లా పర్యటన   •   మొదటి వేతనంతో పాఠశాలకు సౌండ్ సిస్టం అందించిన సర్పంచ్   •   లింగాపూర్ స్టేజ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం   •   మత్తు పదార్థాలు, సామాజిక మాధ్యమాల దుర్వినియోగం, సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి   •  

సురక్షిత ప్రయాణానికి అధిక ప్రాధాన్యత

18-01-2026 06:27 PM

ఎస్సై హనుమా నాయక్

కోదాడ,(చిలుకూరు): సురక్షిత ప్రయాణానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఎస్సై హనుమా నాయక్ అన్నారు. ప్రభుత్వం చేపట్టిన అరైవ్, అలైవ్ లో భాగంగా ఆదివారం చిలుకూరు మండల కేంద్రంలో ఫంక్షన్ హాల్ వద్ద ప్రధాన రహదారిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కు వ్యతిరేకంగా అవగాహన కల్పించారు.

ఎట్టి పరిస్థితుల్లో మద్యం, మత్తు పదార్దాలు తీసుకొని వాహనాలు నడపవద్దన్నారు. మీ ప్రాణాలతో పాటు ఎదుటివారి ప్రాణాలు కూడా ప్రమాదంలో పడతాయని, దీని వలన చట్టప్రకారం కేసులు ఎదుర్కోవడంతో పాటు కుటుంబాలు వీధిన పడే ప్రమాదం ఉందన్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని కోరారు. పోలీసులు, గ్రామస్తులు పాల్గొన్నారు.