మణిపూర్లో హెరాయిన్ను స్వాధీనం.. ముగ్గురు స్మగ్లర్లు అరెస్టు
చురాచాంద్పూర్: మాదకద్రవ్యాల నిరోధక చర్యల్లో భాగంగా చేపట్టిన ఆపరేషన్లో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) అస్సాం రైఫిల్స్, మణిపూర్ పోలీసుల సమన్వయంతో చురాచాంద్పూర్లో రూ.11 కోట్ల విలువైన హెరాయిన్ను స్వాధీనం చేసుకుంది. ఏప్రిల్ 23, 24 తేదీల మధ్య రాత్రి ఈ ఆపరేషన్ నిర్వహించబడిందని, ఈ సందర్భంగా అధికారులు సుమారు 5.4 కిలోల 474 సబ్బు పెట్టెల నిండా ఉన్న హెరాయిన్ను స్వాధీనం చేసుకున్నారు. మహీంద్రా బొలెరో క్యాంపర్ వాహనం లోపల కృత్రిమంగా ఏర్పాటు చేసిన రహస్య అరలో ఈ నిషేధిత మాదకద్రవ్యాన్ని అత్యంత చాకచక్యంగా దాచి ఉంచినట్లు అధికారులు వెల్లడించారు.
ఈ మాదకద్రవ్యాల స్వాధీనంలో చురాచాంద్పూర్ జిల్లాకు చెందిన ముగ్గురు మాదకద్రవ్యాల స్మగ్లర్లను అరెస్టు చేశారు. ప్రాథమిక విచారణలో ఈ సరుకు మయన్మార్ నుండి సేకరించబడిందని, అక్రమ మాదకద్రవ్యాల మార్కెట్లో పంపిణీ చేసే ఉద్దేశంతో దీనిని తరలిస్తున్నారని తెలిపారు. ఈ ప్రాంతంలో భారీ సరిహద్దుల ఆవల మాదకద్రవ్యాల అక్రమ రవాణా నెట్వర్క్ను ఛిన్నాభిన్నం చేసే లక్ష్యంతో, ఆ నెట్వర్క్కు సంబంధించిన పూర్వ, తర్వాతి అనుసంధానాలను (backward and forward linkages) వెలికితీసేందుకు తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు చెప్పారు.
అంతర్జాతీయ మాదకద్రవ్యాల రవాణా మార్గాలకు సులభంగా ప్రభావితమయ్యే అవకాశం ఉన్నందున, మణిపూర్లో ఎన్సీబీ తన నిఘా, అమలు చర్యలను ముమ్మరం చేసింది. మాదకద్రవ్యాలకు సంబంధించిన సమాచారాన్ని ఎంఏఎన్ఏఎస్ హెల్ప్లైన్ (1933) ద్వారా పంచుకోవాలని అధికారులు పౌరులకు విజ్ఞప్తి చేశారు. సమాచారం అందించేవారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని వారు హామీ ఇచ్చారు.






