నిర్మల్లో ఘనంగా ‘వారసత్వ సంబురాలు’
ముఖ్య అతిథిగా రిటైర్డ్ ఐఏఎస్ పార్థసారథి
నిర్మల్, ఏప్రిల్ 11 (విజయక్రాంతి): ఆదిలాబాద్లో రచయితలు విశేషంగా సాహిత్య సృష్టి చేయడం అభినందనీయమని, మహిళా రచయితలు ముందుకు రావడం గర్వకారణమని రిటైర్డ్ ఐఏఎస్, మాజీ రాష్ట్ర ఎన్ని కల కమిషనర్ పార్థసారథి అన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.
శనివారం నిర్మల్ పట్టణంలోని సిటీ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్లో ‘వారసత్వ సంబురాలు’ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉమ్మడి ఆది లాబాద్ జిల్లా చరిత్ర, వైద్య వృత్తి, సంస్కృతి, సాంప్రదాయాలపై జిల్లా రచయితలు రచించిన పలు పుస్తకాలను ఆవిష్కరించారు. అ నంతరం వైద్యులను శాలువాలతో సన్మానిం చి, జ్ఞాపికలు అందజేశారు. ఈ కార్య క్రమం లో ఆర్డీవో రత్నకళ్యాణి, జిల్లా వైద్యులు, కార్యక్రమ నిర్వాహకులు, పాల్గొన్నారు.




