1 July, 2026 | 8:51 PM

Breaking News

ప్రజల పన్నులతో నిర్మించిన 'మహాప్రస్థానం'పై..   •   లయన్స్ క్లబ్ బాన్సువాడ నూతన అధ్యక్షుడిగా పాత బాలకృష్ణ   •   ఓదెల మల్లన్న ఆలయంలో భక్తులపై తేనెటీగల దాడి   •   రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలోని ఆలయాలకు ఉత్సవాలు నిర్వహిస్తాం   •   ఘనంగా ఎల్‌హెచ్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న గిరిజన నాయకులు   •   విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు   •   సందీప్ నగర్ కాలనీ సమస్యలపై కమిషనర్ స్పందన   •   పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •  

ఎర్రుపాలెంలో శాతవాహన సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ తాత్కాలిక నిలుపుదలకు అనుమతి

01-07-2026 07:50 PM

ఎర్రుపాలెం,(విజయక్రాంతి): ఎర్రుపాలెం మండలంలోని తెలంగాణ చిన్న తిరుపతిగా ప్రసిద్ధికెక్కిన జమలాపురం శ్రీ వెంకటేశ్వర స్వామి క్షేత్రంలో జరుగుతున్న మహా కుంభాభిషేకానికి యాత్రికుల సౌకర్యార్థం రైల్వే అధికారులు శాతవాహన సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ నిలుపుదల చేయుటకు అంగీకారం తెలిపినట్లు స్థానిక స్టేషన్ మాస్టర్ తిరుపతిరావు బుధవారం తెలియజేశారు. ఈ అవకాశం ఈనెల మూడవ తారీకు రాత్రి వరకే ఉంటుందని స్థానికులు పరిసరాల వారు యాత్రికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు తెలిపారు.

పర్మినెంట్గా ఆపుటకు తగిన ప్రణాళికలు రూపొందించుకోవాలని వారు తెలిపారు. తాత్కాలిక ఆపుదలకు రైల్వే ప్రయాణికుల సంఘం అధ్యక్షులు వాసిరెడ్డి హనుమంతరావు కొప్పు రవికుమార్ స్థానిక జిల్లా రాష్ట్ర బిజెపి నాయకులు విశేష కృషి సల్పినందులకు మండల పరిసరాల ప్రాంతాల వారు వివిధ సంఘాల వారు కృతజ్ఞతలు తెలిపారు. శాశ్విత నిలుపుదలకు విశేష కృషి చేయాలని పలువురు కోరుతున్నారు.