పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది
ప్రతి అర్హ కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమం చేరేలా కృషి: ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
జడ్చర్ల: మున్సిపాలిటీలోని అంబేడ్కర్ కళాభవన్లో నేడు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద మంజూరైన ఆర్థిక సహాయ చెక్కులను జడ్చర్ల శాసనసభ్యులు జనంపల్లి అనిరుధ్ రెడ్డి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద కుటుంబాల ఆడబిడ్డల వివాహాలకు ఆర్థిక భరోసా కల్పించే లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తోందన్నారు.
అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు పారదర్శకంగా అందేలా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. నియోజకవర్గంలో అర్హులైన లబ్ధిదారులు ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సహాయం అందేలా నిరంతరం కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.






