ఇందిరా శక్తి క్యాంటీన్లో భోజనం చేసిన కలెక్టర్
01-07-2026 07:52 PM
నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లో బుధవారం భోజనం చేసి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహిస్తున్న క్యాంటీన్లో మధ్యాహ్నం 12 గంటలకు అడిషనల్ కలెక్టర్ లు వెంకటేశ్వర్లు కిషోర్ కుమార్ తో కలిసి అమ్మ మేము భోజనం చేస్తాం అంటూ సాధన పౌరుడుగా భోజనం చేశారు. అనంతరం ఆయన స్వయంగా భోజన సంబంధించిన బిల్లులు యూపీఐ ఫోన్ పే ద్వారా చెల్లించి భోజనం నాణ్యత పై పలు సూచనలు చేశారు. జిల్లా కలెక్టరి స్వయంగా సాధారణ పౌరుడుగా భోజనం చేయడంపై కలెక్టర్ కార్లలో అధికారులందరూ కూడా చర్చించుకున్నారు.






