25 March, 2026 | 9:57 PM

టీజీ సెట్ ఫలితాల్లో గుండ్రంపల్లి విద్యార్థుల ఘనత

25-03-2026 08:13 PM

చిట్యాల,(విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం 5వ తరగతి ప్రవేశాల కోసం ఫిబ్రవరిలో నిర్వహించిన టీజీ సెట్  2025 ఫలితాల్లో చిట్యాల మండలం గుండ్రంపల్లి గ్రామానికి చెందిన  విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారు. ఈ ప్రవేశ పరీక్షలో గ్రామానికి చెందిన 15 మంది విద్యార్థులు అర్హత సాధించి, వివిధ గురుకుల పాఠశాలల్లో సీట్లు సాధించినట్లు ప్రిన్సిపల్ దోర్నాల శివ తెలిపారు.

గురుకుల పాఠశాలలకు ఎంపికైన వారిలో ​కోయగుర శివ చరణ్,  ​బోడిగే ఉపేక్ష, కంకల శ్రేష్టి, ​జోగు గహణ ​మారగోని అక్షర, ​అరిగెల నిఖిల్, ​ఉయ్యాల నిహల్, ​సుక్క అశ్విత, ​కళ్లెం మోక్షిత్, ​నమ్ముల నిషిత్, ​కోయగుర శ్రీలేఖ, బొడిగె సాన్వి, ​మైల సాహితి,​రాచకొండ మౌర్య, ​పగడాల సాయి,  చైతన్య ఉన్నారు ​ఈ సందర్భంగా ఎంపికైన విద్యార్థులను ఉద్దేశించి ప్రిన్సిపల్ దోర్నాల శివ మాట్లాడుతూ ఉపాధ్యాయుల కృషి, విద్యార్థుల పట్టుదల వల్లే ఈ విజయం సాధ్యమైందని కొనియాడారు.