9 April, 2026 | 11:35 PM

Breaking News

అల్లూరి జిల్లాలో విషాదం— సెల్ఫీ సరదా విషాదంగా మారింది.. జలపాతంలో పడి ముగ్గురు మృతి   •   బాన్సువాడలో పలు రైస్ డిపోలపై సివిల్ సప్లై అధికారుల దాడులు   •   కేరళలో 75 శాతం పోలింగ్‌ నమోదు   •   ప్రగతి నగర్‌లో ఘనంగా ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు   •   ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలి...   •   హెచ్ఐవిపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి   •   ఏజెన్సీ ప్రాంత రైతుల భూ సమస్యలను పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు   •   హనుమకొండ జిల్లాను వరంగల్ జిల్లాలో కలిపి మహానగరాన్ని అభివృద్ధి చేయండి   •   బీజేపీ ఆధ్వర్యంలో ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు నమోదు   •   ప్రభుత్వ విద్య బలోపేతానికి కృషి చేస్తా..   •  

గిరిజన గురుకుల పాఠశాలకు గ్రీన్కో ఫౌండేషన్ కంప్యూటర్ల అందజేత

09-04-2026 12:59 AM

కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సమక్షంలో కంప్యూటర్ల పంపిణీ

కామారెడ్డి, ఏప్రిల్ 8 (విజయక్రాంతి): వరద ముంపుకు గురైన గిరిజన గురుకుల పాఠశాల కు గ్రీన్కు ఫౌండేషన్ ఆధ్వర్యంలో బుధవారం కంప్యూటర్లను పంపిణీ చేశారు. నాగిరెడ్డిపేట చెందిన  గిరిజన గురుకుల పాఠశాల కామారెడ్డి సమీపంలోని సరంపల్లి వద్ద నిర్వహిస్తున్నారు. ఇటీవల కామారెడ్డి లో వరదలు వచ్చినప్పుడు గిరిజన గురుకుల పాఠశాలలోని కంప్యూటర్ ల్యాబ్ వరద నీటికి కొట్టుకపోయింది. కంప్యూటర్లు పాడైపోయాయి.

ఈ విషయాన్ని గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ అమర్ సింగ్  కలెక్టర్ దృష్టికి తీసుకురావడంతో ఆయన స్పందించి గ్రీన్కో ఫౌండేషన్ కు తెలపడంతో వారు సానుకూలంగా స్పందించి  కంప్యూటర్లను కలెక్టర్ ఆశిష్ సంగు వాన్ సమక్షంలో ప్రిన్సిపల్ అమర్ సింగ్ కు అందజేశారు. ఈ సందర్భంగా గురుకుల పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రీన్కో ఫౌండేషన్ ప్రతినిధులకు కలెక్టర్కు కృతజ్ఞతలు తెలిపారు.