13 March, 2026 | 5:43 PM

బండి సంజయ్ మహా పాదయాత్ర విజయవంతం చేయండి

13-03-2026 04:50 PM

బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి అశోక్ రావు

సుల్తానాబాద్,(విజయకాంతి): ఈ నెల 14న శనివారం ఉదయం 7 గంటలకు కరీంనగర్ లోని మహాశక్తి ఆలయం నుండి కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్  కుమార్ ఆధ్వర్యంలో కొండగట్టు వరకు మహా పాదయాత్ర ప్రారంభించడం జరుగుతుంది. కావున పెద్దపల్లి నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాల నుండి మున్సిపాలిటీల నుండి అధిక సంఖ్యలో బీజేపీ నాయకులు కార్యకర్తలు హిందూ బంధువులు పాల్గొని మహా పాదయాత్రను విజయవంతం చేయాలని పెద్దపల్లి బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి ఆశోక్ రావు బీజేపీ రాష్ట్ర నాయకులు నల్ల మనోహర్ రెడ్డి లు శుక్రవారం పిలుపునిచ్చారు.  ఈ విలేఖరుల సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లె సదానందం, జిల్లా ఉపాధ్యక్షులు శనిగరపు రమేష్, జిల్లా కార్యదర్శిగర్రెపెల్లి  నారాయణ, స్వామి,  కౌన్సిలర్ కందునూరి సమత కుమార్, మాజీ సర్పంచ్ పల్లె ఓదెలు, కొమ్ము తిరుపతి, లంక శంకర్, నాగుల మాల్యాల తిరుపతి.కామిని రాజేంద్రప్రసాద్, గజభీంకార్ పవన్ , భూసారపు సంపత్ , ఎర్రం సంతోష్ రెడ్డి , తదితరులు పాల్గొన్నారు.