8 May, 2026 | 4:36 AM

పవన్ కుమార్‌కు ఘన సన్మానం

08-05-2026 12:00 AM

భూత్పూర్, మే 7 :  మున్సిపాలిటీ పరిధిలోని అమిస్తాపూర్ లో శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయ కమిటీ అధ్యక్షులుగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పవన్ కుమార్ ను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన దేవాదాయ కమిటీ అధ్యక్షులుగా ఎన్నికైన పవన్ కుమార్ ను పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు లిక్కి నవీన్ గౌడ్ శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా లిక్కీ నవీన్ గౌడ్  మాట్లాడుతూ దేవాలయ అభివృద్ధికి ఆయన సేవలు మరింత ఉపయోగపడాలని ఆకాంక్షించారు. పవన్ కుమార్ కి హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కేంద్యాల  నరేందర్, మట్టి ఆనంద్, ఆగిరి రవి, మచ్చేందర్, రాజేష్, ఎర్రన్న, డోకుర్ శంకర్, బాల్రాజ్, దిలీప్, మల్లేష్, వెంకటేష్ తో పాటు తదితరులు ఉన్నారు.