13 June, 2026 | 1:46 PM

Breaking News

ఘనంగా మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ జన్మదిన వేడుకలు   •   బిజెపి పార్టీ పటిష్టతకు కృషి చేస్తా: ఓబీసీ జిల్లా అధ్యక్షులు   •   మంత్రి జూపల్లి కృష్ణారావు ఘనంగా స్వాగతించిన నియోజకవర్గ ఇన్చార్జ్   •   గత ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను వివరించండి: ఎమ్మెల్యే జాదవ్ అనిల్   •   తెలంగాణ ఉద్యమంలో రేవంత్ ఒక్కనాడైనా పాల్గొన్నారా?: KTR   •   భవిష్యత్ యుద్ధాలకు సిద్ధంగా ఉండండి.. క్యాడెట్లకు రాజ్‌నాథ్ సింగ్ సూచన   •   పెండింగ్ వంతెనలు పూర్తి చేయాలి   •   కొట్టుకుపోయిన వంతెన వద్ద మరమ్మత్తులు   •   పాఠశాలలో దోమల నివారణ మందు పిచికారీ   •   శ్రీ వాసవి మాత దేవాలయం లో ప్రత్యేక పూజలు   •  

అకాల వర్షాలతో తడిసిన ధాన్యం.. రైతుల ఆందోళన

13-06-2026 01:33 AM

బచ్చన్నపేట, జూన్ 12 (విజయక్రాంతి): మండల పరిధిలో కురిసిన అకాల వర్షాలకు కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉంచిన ధాన్యం తడిసి రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. సరైన రక్షణ చర్యలు లేకపోవడంతో ధాన్యం నీటిలో నానిపోవడం, గోనె సంచులు తడవడం వల్ల నాణ్యత దెబ్బతింటుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని తగిన విధంగా టార్పాలిన్లతో కప్పకపోవడం, వర్షపు నీరు నిల్వ ఉండటంతో పెద్ద ఎత్తున ధాన్యం తడిసినట్లు రైతులు తెలిపారు. ఇప్పటికే పంట సాగులో నష్టాలు ఎదుర్కొన్న రైతులకు ఈ పరిస్థితి మరింత భారంగా మారిందన్నారు.

తడిసిన ధాన్యాన్ని అధికారులు వెంటనే పరిశీలించి నష్టపరిహారం అందించడంతో పాటు కొనుగోలు ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. అలాగే కొనుగోలు కేంద్రాల్లో సరిపడా టార్పాలిన్లు, భద్రతా ఏర్పాట్లు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.అకాల వర్షాల కారణంగా ధాన్యం నాణ్యత తగ్గితే రైతులకు ఆర్థిక నష్టం తప్పదని, ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులను ఆదుకోవాలని స్థానిక రైతు సంఘాల నాయకులు కోరారు.