27 July, 2026 | 6:28 PM

Breaking News

పైతర పంచాయతీ కార్మికులకు ప్రమాద బీమా పత్రాల పంపిణీ   •   సర్ ప్రక్రియను పరిశీలించిన జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు   •   విద్యాబోధనలో నూతన విధానాలను అమలు చేయాలి   •   యూనియన్ బ్యాంకులో తెలుగు తెలిసిన సిబ్బందిని నియమించాలి   •   ఎల్ నినోను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారికి నిత్య కళ్యాణం   •   గ్రామ పంచాయతీ కార్మికులకు కనీస వేతనాన్ని అమలు చేయాలి: జడ శ్రీనివాస్   •   డబుల్ బెడ్‌రూం ఇళ్ల సమస్యలపై కలెక్టర్‌కు సీపీఎం వినతి   •   ఎల్ నినో దృష్య వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలి   •   హమాలీ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి: టీయూసీఐ   •  

ఆదివాసులపై ప్రభుత్వ చర్యలు మానుకోవాలి

05-06-2026 04:34 PM

నిర్మల్,(విజయక్రాంతి): ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసి గిరిజనులు తమ హక్కుల కోసం పోరాడితే ప్రభుత్వం వారిపట్ల వివక్ష చూపుతూ నిర్బంధం చేయడం మానుకోవాలని తెలంగాణ సామాజిక కార్యకర్త ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఉద్యమకారుడు అజయ్ డిమాండ్ చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గిరిజనుల సమస్యలపై గిరిజనులు ప్రభుత్వం దృష్టికి అనేకసార్లు సమస్యలను విన్నవించడం జరిగిందన్నారు.

గిరిజన గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని అధికారులకు ప్రజా ప్రతినిధులకు విన్నవిస్తే నిర్మల్ అదిలాబాద్ ఆసిఫాబాద్ తదితర ప్రాంతాల్లో వారి ఉద్యమాలను అడ్డుకోవడం వారిపై కేసులు పెట్టడం సరైన కాదన్నారు. గిరిజన గ్రామాల్లో విద్యా వైద్యం తాగునీరు సాగునీరు విద్యుత్తు వంటి మౌలిక సదుపాయాలు కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వ అధికారుల లదే అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చేపట్టిన పీపుల్స్ ఫ్రంట్ పాదయాత్రలో పెద్ద ఎత్తున గిరిజనులు పాల్గొని సంఘీభావం తెలిపిన విషయాన్ని ప్రభుత్వం గుర్తించాలన్నారు.

గిరిజన గ్రామాల్లో ప్రజల మోడీకి సదుపాయాలు కల్పించాలని ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా ఇందిరమ్మ ఇల్లు రవాణా సౌకర్యం మెరుగుపరచాలని అటవీ ఉత్పత్తులపై ఆంక్షలు ఎత్తివేయాలని గిరిజనులకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. వారి హక్కుల కోసం చేస్తున్న పోరాటానికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్టు తెలిపారు.