సోనాల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రతిభ కనబరిచిన ఇద్దరు బాలికలు
29-04-2026 07:31 PM
ఆంగ్ల మాధ్యమ విభాగంలో జోహార్ టాస్కిల్ 560 మార్కులు
తెలుగు మాధ్యమ విభాగంలో సోలంకి అనన్య 540 మార్కులు.
బోథ్,(విజయక్రాంతి): సోనాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 100% ఫలితాలు సాధించడం జరిగింది ఒక వంద 33 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా రాసిన వారందరూ పాస్ అయినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు దేశ్ముఖ సచిన్ తెలిపారు. అయితే ఆంగ్ల మధ్యమ విభాగంలో జోహో టాస్కిల్ 560 మార్పులు సంపాదించి టాపర్గా నిలిచింది. తెలుగు మాధ్యమ విభాగంలో సోలంకి అనన్య 540 మార్కులు సాధించి టాపర్గా నిలవడం జరిగింది. విద్యార్థుల ప్రతిభను గుర్తించి వారి తల్లిదండ్రులు ఉపాధ్యాయులు హర్షం వ్యక్తపరిచారు.






