5 May, 2026 | 6:26 PM

Breaking News

అడవుల సంరక్షణలో సిబ్బంది కార్యోన్ముఖులు కావాలి: డీఎఫ్ఓ బాలమణి   •   ఆయిల్ ఫాం సాగుకు రైతులు ముందుకు రావాలి: కలెక్టర్ హరిత   •   పండుగలు వేడుకలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి   •   రాష్ట్ర ప్రభుత్వం సేకరించిన ధాన్యాన్ని కేంద్రం తీసుకోవాలి   •   కొత్తరకం పంటలపై రైతాంగానికి అవగాహన కల్పిస్తాం   •   కొమ్ముగుడెంలో సిసి రోడ్లు ప్రారంభించిన సోయం వీరభద్రం   •   జనాభాగణాలపై ముగిసిన శిక్షణ   •   నవోదయకు విద్యార్థి ఎంపిక   •   గోవులను రక్షించే క్రమంలో చట్టాలను అతిక్రమించ వద్దు   •   అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో టీవీకే చీఫ్ జోసెఫ్ విజయ్ చిత్రపటానికి పాలాభిషేకం   •  

ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలి ధర్నా

16-03-2026 01:40 AM

బంధువులతో కలిసి వంటా వార్పు

చేగుంట, మార్చి 15: పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేసిన ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు ధర్నాకు దిగింది. ఈ ఘటన మెదక్ జిల్లా చేగుంట మండలం పెద్ద శివనూర్ గ్రామంలో ఆదివారం జరిగింది. చేగుంట మండలం పెద్ద శివనూర్ గ్రామానికి చెందిన ముదాం వినయ్ (23), అదే గ్రామానికి చెందిన యువతి ప్రేమించుకున్నారు.

పెళ్లి చేసుకుంటానని నమ్మించిన వినయ్.. గత కొన్నేళ్లుగా ఆమెతో సహజీవనం చేశాడు. పెళ్లి చేసుకోవాలని ప్రియురాలు ఒత్తిడి తేవడంతో పెళ్లికి నిరాకరించా డు. దీంతో కుటుంబ సభ్యులు, కులస్తుల ఆధ్వర్యంలో ప్రియు డి ఇంటి ముందు ధర్నా, వంటా మార్పు చేశారు. చేగుంట ఎస్సై చైతన్య కుమార్‌రెడ్డి గ్రా మానికి చేరుకొని ఇరు కుటుంబాలను చేగుంట పోలీస్ స్టేష న్‌కు తీసుకెళ్లారు.