11 May, 2026 | 12:16 PM

Breaking News

ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు   •   కాఠ్మండు విమానాశ్రయంలో కలకలం—టర్కిష్ ఎయిర్‌లైన్స్ విమానం టైరులో మంటలు   •   యువ దంపతుల విషాదాంతం.. పుట్టింట్లో భార్య.. తట్టుకోలేక భర్త ఆత్మహత్య   •   National Technology Day: నూతన ఆవిష్కరణలకు ప్రజాప్రభుత్వం మద్దతు   •   తక్కెళ్ళపాడు పంచాయతీ ప్రహరీ గోడ పనులను ప్రారంభించిన సర్పంచ్   •   కంపెనీలకు అక్రమ నీటి దందా జోరు.. అధికారుల నిర్లక్ష్యం   •   రేపు హమాన్ జయంతి సందర్భంగా విశేష పూజలు, ర్యాలీ   •   పేద రోగులకు సేవ చేయాల్సిన బాధ్యత వైద్యులపై ఉన్నది   •   రిటైర్డ్ ఐపీఎస్ భార్య హత్య కేసులో వెలుగులోకి సంచలన విషయాలు   •   తొమ్మిదేళ్ల తర్వాత చైనాకు ట్రంప్, షెడ్యూల్ ఖరారు   •  

దుర్గాదేవి అలంకారంలో దర్శనమిచ్చిన గజ్వేల్ మహంకాళి

29-09-2025 07:08 PM

మూలా నక్షత్రం సందర్భంగా చిన్నారులతో పుస్తక పూజలు..

దర్శించుకున్న ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి..

గజ్వేల్: గజ్వేల్ పట్టణంలోని మహంకాళి ఆలయంలో అమ్మవారు సోమవారం దుర్గాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చింది. అమ్మవారికి చతు షష్టి పూజలు, గోపూజ, కుంకుమార్చనలు, చిన్నారులతో సామూహిక పుస్తక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ లు ఎంసీ రాజమౌళి, గాడి పల్లి భాస్కర్, మాజీ కౌన్సిలర్లు గోపాల్ రెడ్డి, బాలేష్, సుభాష్ చంద్రబోస్ తదితరులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు కాలువ శ్రీధర్ రావు, ప్రధాన అర్చకులు నంద బాల శర్మ, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.