11 May, 2026 | 12:04 PM

Breaking News

కాఠ్మండు విమానాశ్రయంలో కలకలం—టర్కిష్ ఎయిర్‌లైన్స్ విమానం టైరులో మంటలు   •   యువ దంపతుల విషాదాంతం.. పుట్టింట్లో భార్య.. తట్టుకోలేక భర్త ఆత్మహత్య   •   National Technology Day: నూతన ఆవిష్కరణలకు ప్రజాప్రభుత్వం మద్దతు   •   తక్కెళ్ళపాడు పంచాయతీ ప్రహరీ గోడ పనులను ప్రారంభించిన సర్పంచ్   •   కంపెనీలకు అక్రమ నీటి దందా జోరు.. అధికారుల నిర్లక్ష్యం   •   రేపు హమాన్ జయంతి సందర్భంగా విశేష పూజలు, ర్యాలీ   •   పేద రోగులకు సేవ చేయాల్సిన బాధ్యత వైద్యులపై ఉన్నది   •   రిటైర్డ్ ఐపీఎస్ భార్య హత్య కేసులో వెలుగులోకి సంచలన విషయాలు   •   తొమ్మిదేళ్ల తర్వాత చైనాకు ట్రంప్, షెడ్యూల్ ఖరారు   •   అర్ధరాత్రి అమానుషం.. పోలీస్ కానిస్టేబుల్ హత్య   •  

కంపెనీలకు అక్రమ నీటి దందా జోరు.. అధికారుల నిర్లక్ష్యం

11-05-2026 11:18 AM

లక్షల లీటర్లు తరలింపు, కోట్ల రూపాయలు సొమ్ము చేసుకుంటున్న వ్యాపారులు 

అధికారులు పూర్తి నిర్లక్ష్యం వహిస్తున్న వైనం 

జిన్నారం/ అమీన్ పూర్: జిన్నారం మండలంలోని కొర్లకుంట, కిష్టయ్యపల్లి, గడ్డపోతారం, ఖాజిపల్లి, బొల్లారం ప్రాంతాల్లో పరిశ్రమలు, కంపెనీలకు అక్రమ నీటి దందా జోరుగా సాగుతోంది. స్థానిక వనరులను, ముఖ్యంగా రైతుల పొలాల్లోని బోరుబావులను అక్రమంగా వాడుకుంటూ నీటి మాఫియా(Illegal Water Racket) భారీగా సొమ్ము చేసుకుంటున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి.నీటి అవసరం ఎక్కువగా ఉండటంతో, సమీప పొలాల్లోని బోరుబావుల నుండి 24 గంటలూ నీటిని తోడేస్తున్నారు.

అనుమతి లేకుండా ప్రభుత్వ భూములు, వ్యవసాయ పొలాల్లో బోర్లు వేసి, అక్రమంగా నీటిని తరలిస్తున్నారు.నిత్యం లక్షల లీటర్ల నీటిని ట్యాంకర్ల ద్వారా పరిశ్రమలకు రవాణా చేస్తూ, కోట్లాది రూపాయల వ్యాపారం చేస్తున్నారు. ఇంత దందా సాగుతున్నా, అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. అక్రమ నీటి తరలింపు వల్ల భూగర్భ జలాలు అడుగంటిపోయి, ఆయా ప్రాంతాలు ఎడారిగా మారే ప్రమాదం ఉందని హెచ్చరికలు వెలువడుతున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ఈ అక్రమ నీటి దందా ను ఆపాలని స్థానికులు కోరుతున్నారు.