11 May, 2026 | 1:11 PM

Breaking News

మొగిలిపేట క్లస్టర్ గ్రామాల్లో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అవగాహన కార్యక్రమం   •   ​తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి   •   పంటకోతకు యంత్రాల కొరత.. ఇబ్బందులు పడుతున్న రైతన్న   •   బంగారం కొనుగోళ్లపై దేశప్రజలకు హెచ్చరించిన ప్రధాని మోదీ   •   చంబాలో లోయలో పడిన కారు: ఆరుగురు గుజరాత్‌ పర్యాటకులు మృతి   •   మేడ్చల్‌లో విషాదం: కౌకూర్ చెరువులో అన్నదమ్ముల మృతదేహాలు లభ్యం   •   అమ్మ ఒడి కార్యక్రమంలో గర్భిణీలకు వైద్య పరీక్షలు   •   ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు   •   కాఠ్మండు విమానాశ్రయంలో కలకలం—టర్కిష్ ఎయిర్‌లైన్స్ విమానం టైరులో మంటలు   •   యువ దంపతుల విషాదాంతం.. పుట్టింట్లో భార్య.. తట్టుకోలేక భర్త ఆత్మహత్య   •  

కాఠ్మండు విమానాశ్రయంలో కలకలం—టర్కిష్ ఎయిర్‌లైన్స్ విమానం టైరులో మంటలు

11-05-2026 11:58 AM

 ప్రమాద సమయంలో 277 మంది ప్రయాణికులు

కాఠ్మండు: నేపాల్ రాజధాని కాఠ్మండులో సోమవారం ల్యాండ్ అయిన ఒక టర్కిష్ ఎయిర్‌లైన్స్(Turkish Airlines Plane Tyre Catches Fire) విమానం అగ్నిప్రమాదానికి గురైందని అధికారులు తెలిపారు. ఈ ఘటన కారణంగా విమానాశ్రయాన్ని ఒక గంట పాటు మూసివేయాల్సి వచ్చింది. ఇస్తాంబుల్ నుండి వచ్చిన Airbus A330 విమానంలోని మొత్తం 277 మంది ప్రయాణికులు, 11 మంది సిబ్బందిని, మంటలు చెలరేగిన అనంతరం ఎమర్జెన్సీ ఎగ్జిట్ ద్వారా సురక్షితంగా బయటకు తరలించినట్లు, నేపాల్ పౌర విమానయాన సంస్థ ప్రతినిధి జ్ఞానేంద్ర భూల్ మీడియాకి తెలిపారు. విమానం రన్‌వేపై కదులుతుండగా (taxiing) ల్యాండింగ్ గేర్‌లో పొగ కనిపించిందని, దీనిపై సాంకేతిక తనిఖీలు ప్రారంభించినట్లు టర్కిష్ ఎయిర్‌లైన్స్ తెలిపింది. హైడ్రాలిక్ పైపులో తలెత్తిన సాంకేతిక లోపం వల్లే ఆ పొగ వచ్చిందని ప్రాథమిక అంచనాలు సూచిస్తున్నాయి.