నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే పద్మా రెడ్డి
05-07-2026 06:01 PM
పాపన్నపేట: మండల పరిధిలోని కుర్తివాడ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు దుర్గయ్య కుమార్తె నిఖిత వివాహం ఆనంద్ తో ఆదివారం కొత్తపల్లిలోని అనంత పద్మనాభ స్వామి ఫంక్షన్ హాల్లో ఘనంగా జరిగింది. ఈ వివాహానికి మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, మండల నాయకులతో కలిసి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.






