30 July, 2026 | 8:24 PM

Breaking News

శిథిలావస్థలో ఉన్న ఇండ్ల లబ్ధిదారులను గుర్తించి సురక్షిత ప్రాంతాలకు తరలించాలి   •   ఎస్‌ఐఆర్ కార్యక్రమంలో సత్తుపల్లి నియోజకవర్గానికి జిల్లా స్థాయిలో రెండో స్థానం   •   వర్షాలపై ప్రత్యేక దృష్టి వార్డుల్లో కమిషనర్ పర్యటన   •   నల్లమలలో ప్రత్యక్షమైన నంది విగ్రహం!   •   దంచి కొట్టింది..!!   •   భారీ వర్షాలు, అప్రమత్తమే ప్రాణరక్షణ!   •   'స్నేహితుల దినోత్సవం' గీతాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్సీ యాదవ రెడ్డి   •   ఇద్దరు మైనర్ బాలికలను 12 గంటల్లోనే సురక్షితంగా గుర్తించిన పోలీసులు   •   ప్రజాస్వామ్యం బలోపేతానికి ఓటర్ నిర్ణయమే కీలకం: డిసిసి అధ్యక్షులు   •   వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి   •  

మోరంచవాగు ఉద్ధృతిని పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే గండ్ర

30-07-2026 07:12 PM

భూపాలపల్లి,(విజయక్రాంతి): మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి గణపురం మండలం చెల్పూర్ గ్రామాల మధ్యనున్న మోరంచవాగు భారీ వర్షాల కారణంగా ఉద్ధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో అక్కడికి వెళ్లి పరిస్థితిని పరిశీలించారు. ఈ సందర్భంగా వాగు ప్రవాహాన్ని ప్రత్యక్షంగా పరిశీలించిన ఆయన స్థానిక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వాగులు, చెరువులు, లోతట్టు ప్రాంతాల వద్దకు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని విజ్ఞప్తి చేశారు. అధికారులు నిరంతరం పరిస్థితిని పర్యవేక్షిస్తూ ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ఆయన కోరారు.