వైద్యులకు మాజీమంత్రిఇంద్రకరణ్ రెడ్డి సన్మానం
02-07-2026 02:02 AM
నిర్మల్జూలై 1 ( విజయ క్రాంతి): నిర్మల్ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ ఆస్పత్రిలో విశిష్ట సేవలు అందిస్తున్న వైద్యులను రాష్ట్ర మాజీ మంత్రి ఏ ఇంద్రకరణ్ రెడ్డి బుధవారం స న్మానం చేశారు. పట్టణంలోని వివిధ హాస్పటల్లో పని చేస్తున్న వారిని శాలువాతో సత్కరించి డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ప్రమోద్ చంద్ర రెడ్డి డాక్టర్ కిరణ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు.






