22 April, 2026 | 1:10 PM

Breaking News

ఉప్పల్ బస్ డిపో ముందు ఆర్టీసీ కార్మికులతో తీన్మార్ మల్లన్న ధర్నా   •   మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు కన్నుమూత   •   కాళేశ్వరంపై నిందలు వేసి... కేసీఆర్ ప్రతిష్ట దెబ్బతీసేందుకు కుట్ర   •   కట్టుదిట్టమైన పర్యవేక్షణతో నాణ్యమైన రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలి   •   ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి   •   గంజి చంద్రమౌళి మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు   •   రేవంత్ రెడ్డి నిజస్వరూపం... హైకోర్టు తీర్పుతో తేటతెల్లం   •   పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి పొంగులేటి   •   దేశాయిపేటలో పారిశుద్ధ్యం అస్తవ్యస్తం   •   ఆర్టీసీ సమ్మె విరమించాలని మంత్రి పొన్నం విజ్ఞప్తి   •  

స్నేహితుడి కుటుంబానికి ఆర్థిక చేయూత

21-11-2025 07:38 PM

వెంకటాపూర్(రామప్ప),(విజయక్రాంతి): మండలంలోని నర్సాపూర్ గ్రామానికి చెందిన కల్లెపు పైడి ఇటీవల మరణించగా, ఆయనతో చిన్నప్పటి నుండి చదువుకున్న బాల్యమిత్రులు తమ స్నేహబంధానికి దారంగా నిలిచే విధంగా ఆదర్శప్రాయమైన అడుగు వేశారు. శుక్రవారం నిర్వహించిన తొమ్మిదవ రోజు కార్యక్రమంలో భాగంగా, మృతుడి స్వగృహానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి రూ.10,000 ఆర్థిక సహాయం అందజేశారు. కష్టకాలంలో మిత్రులు ఇలా అండగా నిలవడం గ్రామస్థుల ప్రశంసలు పొందుతోంది. ఈ కార్యక్రమంలో స్నేహితులు పుల్యాల రమేష్, శంకర్, అశోక్, ప్రసాద్, కుమార్, శ్రీనివాస్, ప్రేమ, విజయ, సునీత, సునంద లు పాల్గొని సహాయం అందించారు.