24 August, 2026 | 8:49 PM

రుద్రంగి మృతుల కుటుంబాలకు ఆది కార్తీక్ ఆర్థిక సాయం

24-08-2026 04:21 PM

 రుద్రంగి ఆగష్టు 24(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి లింగంపేట సరిహద్దులా మధ్య జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో రుద్రంగికి చెందిన నలుగురు రక్తసంబంధీకులు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఊహించని దుర్ఘటనతో శోకసంద్రంలో మునిగిపోయిన బాధిత కుటుంబాలకు వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తనయుడు కార్తీక్ రూ. 50,000/ల ఆర్థిక సహాయాన్ని అందించి బాధిత కుటుంబాలకు కష్టకాలంలో అండగా నిలిచారు.

ఈ ఆర్థిక సహాయాన్ని వేములవాడ ఏరియా ఆసుపత్రి వద్ద స్థానిక రుద్రంగి సర్పంచ్ గండి నారాయణ, మార్కెట్ కమిటీ చైర్మన్ చెలుకల తిరుపతిల చేతుల మీదుగా అందజేశారు. ఒకే కుటుంబంలో నలుగురు సొంత మనుషులను కోల్పోయిన కష్టకాలంలో అండగా నిలిచి తక్షణ సహాయం అందించిన ఆది కార్తీక్‌ సేవా దృక్పథాన్ని నాయకులు కొనియాడారు.​ ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తర్రే మనోహర్, పల్లి గంగాధర్, కొమిరే శంకర్ తదితరులు పాల్గొన్నారు.