24 August, 2026 | 9:45 PM

Breaking News

పోచమ్మ దేవత విగ్రహ ప్రతిష్టకు ఆహ్వానం   •   ప్రభుత్వ ఆసుపత్రి డైట్ క్యాంటీన్ ను తనిఖీ చేసిన ఆహార భద్రతా అధికారి జి వరుణ్ రెడ్డి   •   ఆపదలో ఉన్న కుటుంబానికి ఆర్థిక సాయం   •   చిలుకూరును డైరీ హబ్ గా తీర్చిదిద్దాలి   •   గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి పని చేస్తోంది   •   ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి   •   డ్రైవర్ కుటుంబానికి తోటి డ్రైవర్ల ఆర్థిక చేయూత   •   విద్యార్థులు కమ్యూనికేషన్, ఏఐ స్కిల్స్ పెంపొందించుకోవాలి   •   డీజిల్‌ దొంగతనం కేసులో ఇద్దరు అరెస్ట్‌   •   లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన రెవెన్యూ ఇన్‌స్పెక్టర్, జీపీఓ   •  

విద్యుత్ షాక్ తో బర్రె మృతి

24-08-2026 08:24 PM

చేర్యాల,(విజయక్రాంతి): చేర్యాల పట్టణంలో ఉట్లపల్లి వీధిలో సోమవారం సాయంత్రం విద్యుత్ ప్రమాదంతో పాడి బర్రె మృతి చెందింది.బాధిత రైతు అవుచర్ల కిష్టయ్య తనకు చెందిన బర్రె చనిపోవడంతో దాదాపు రూ.లక్ష వరకు నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. రోజంతా ముసురుతో కూడిన వర్షం పడటంతో ట్రాన్స్‌ఫార్మర్ చుట్టూ జాలి ఏర్పాటు చేయకపోవడంతో భద్రతా చర్యలు పాటించకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.బాధిత రైతును ప్రభుత్వం ఆదుకోవాలని,విద్యుత్ శాఖ అధికారులు వెంటనే స్పందించి ట్రాన్స్ఫార్మర్ చుట్టూ జాలి ఏర్పాటు చేయాలని గ్రామస్థులు డిమాండ్ చేశారు.