23 June, 2026 | 6:08 PM

జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షుడు రజనీకర్ రెడ్డికి సన్మానం

23-06-2026 04:32 PM

నంగునూరు,(విజయక్రాంతి): బీజేపీ సిద్దిపేట జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షుడిగా నియమితులైన వల్లపు రెడ్డి రజనీకర్ రెడ్డిని నంగునూరు మండల బీజేపీ నాయకులు ఘనంగా సత్కరించారు. మండల అధ్యక్షుడు వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు రజనీకర్ రెడ్డిని శాలువాతో సన్మానించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా తన నియామకానికి సహకరించిన పార్టీ రాష్ట్ర,జిల్లా అధిష్టానానికి,మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు కి రజనీకర్ రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు.