15 June, 2026 | 2:32 PM

Breaking News

పెద్దపల్లిలో కాంగ్రెస్ బూత్ లెవెల్ ఏజెంట్ల శిక్షణ తరగతులు   •   తెలంగాణ ఏర్పాటును ఏనాడూ జనసేన వ్యతిరేకించలేదు   •   ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి   •   మొదటి రోజున నూతనంగా చేరిన విద్యార్థులకు ఘనస్వాగతం   •   ప్రభుత్వ విద్యపై భరోసా.. కొడుకును ప్రభుత్వ పాఠశాలలో చేర్పించిన మచ్చుపేట సర్పంచ్   •   కర్కోటక కాంగ్రెస్ ప్రభుత్వం.. బెల్లంపల్లిలో కవిత హల్‌చల్‌   •   తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సబ్ కమిటీ సమావేశం   •   కార్మికుల దీక్షలకు స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ప్రత్యక్ష మద్దతు ఇవ్వాలి   •   యోగ దినచర్యలో భాగం కావాలి: జిల్లా ప్రోగ్రాం అధికారి   •   మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు ఫిషరీస్ భూమి సర్వే పూర్తి   •  

ఆయిల్ పామ్ సాగుకు రైతులు ముందుకు రావాలి

30-10-2025 12:39 AM

జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య

సంగారెడ్డి, అక్టోబర్ 29 (విజయక్రాంతి) :ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ, ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో బుధవారం సంగారెడ్డి జిల్లాలో ఆయిల్ ఫాం పంట అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సదస్సులో ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య పాల్గొన్నారు. ఆయిల్ ఫాం పంట ఆర్థికంగా లాభదాయకమని, నీటి వనరులు ఉన్న ప్రాంతాల్లో ఈ పంట విస్తరణకు రైతులు ముందుకు రావాలన్నారు.

ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ, ప్రోత్సాహక పథకాలు రైతులకు ఎంతో మేలు చేస్తాయన్నారు. ఉద్యాన శాఖ అధికారులు ప్రతి మండలంలో ఆయిల్ ఫాం సా గుకు అనుకూలమైన భూభాగాలను గుర్తించాలని, రైతులకు తగిన శిక్షణ, అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఈ సందర్భంగా ఉద్యాన శాఖ అధికారి, పట్టు పరిశ్రమ శాఖ అధికారి, సహకార సంఘాల ప్రతినిధులు, రైతులు, పి.ఎ.సి.ఎస్. సెక్రటరీలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.