30 June, 2026 | 11:34 PM

Breaking News

పెంచికల్‌పేట్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ   •   మండల అధ్యక్షులుగా అంకం శ్రీనివాస్   •   రాంకీ డంపింగ్ యార్డ్ తొలగింపే లక్ష్యం   •   రాష్ట్రంలో ఎక్కడ చూసినా కులవివక్షత కొనసాగుతుంది   •   ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •  

వ్యవసాయశాఖ మంత్రి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కంతనపల్లి రైతులు

05-11-2025 12:14 AM

కన్నాయిగూడెం, నవంబరు4 (విజయక్రాంతి): తెలంగాణ సచివాలయంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మరియు వ్యవసాయ శాఖ డైరెక్టర్ గోపి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయం నుండి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో కంతనపల్లి రైతులు పాల్గొనడం జరిగింది. పాల్గొన్న రైతులకు మంత్రి ఆయిల్ పామ్ పంట సాగు వివరాలు భూసార పరీక్ష పత్రాల ఆవశ్యకతను రైతులకు పలుసూచలు వివరించారు.

అనంతరం సహాయ వ్యవసాయ సంచాలకులు ఏటూరునాగారం జే అవినాష్ వర్మ మరియు వ్యవసాయ అధికారి ముంజ మహేష్, వ్యవసాయ శాఖ డైరెక్టర్ గోపి ఆదేశాల మేరకు కంతనపల్లి రైతులకు భూసార పరీక్ష పత్రాల పంపిణీ చేయడం జరిగింది, అంతేకాకుండా భూసార పరీక్ష ఫలితాల ఆధారంగా ఎరువుల వాడకం గురించి రైతులకు వివరించడం జరిగింది.

ఈకార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి గోవిందరావుపేట్ కె జితేందర్ రెడ్డి, వ్యవసాయ విస్తరణ అధికారులు కళ్యాణి, ప్రియాంక మరియు రైతులు పాల్గొనడం జరిగింది.