07-02-2026 03:22:30 PM
ఊర్కొండ: సహకార రంగం ద్వారానే గ్రామీణ అభివృద్ధి సాధ్యమవుతుందని నాబార్డ్ మహబూబ్నగర్ క్లస్టర్ కార్యాలయ ప్రతినిధులు అన్నారు. ‘అంతర్జాతీయ సహకార సంవత్సరం–2025’ సందర్భంగా శనివారం ఊర్కొండ రైతు వేదికలో ప్రత్యేక అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులే యజమానులుగా ఉండే సహకార సంఘాలు మరింత బలోపేతం కావాలని వారు పిలుపునిచ్చారు. నాబార్డ్ ద్వారా అందుబాటులో ఉన్న రుణాలు, పథకాలపై రైతులకు వివరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మంజుల, శ్యామ్తో పాటు పలువురు రైతులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.