17 April, 2026 | 5:22 PM

గాయని మంగ్లీపై అసత్య ఆరోపణలు తీవ్రంగా ఖండిస్తున్న

17-04-2026 03:46 PM

మఠంపల్లి,(విజయక్రాంతి): ప్రముఖ గాయని మంగ్లీఫై సంబంధం లేని కేసులలో ఇరికించడానికి ప్రయత్నం చేస్తున్నారని ఆమె పరువు ప్రతిష్టలను భంగాపరిచేటువంటి కుట్రను తీవ్రంగా ఖండిస్తున్నామని మఠంపల్లి మండల గిరిజన శక్తి అధ్యక్షుడు బానోతు ఈశ్వర్ నాయక్ తెలిపారు. శుక్రవారం వారు మాట్లాడుతూ... ఎక్కువ ప్రజలకు అధిక వడ్డీ ఆశ చూపిస్తూ కోట్లాది  రూపాయలు వసూలు చేసిన సూత్రధారులైన రమావత్ మధు,హేమ కాంత్ రెడ్డిపై  కఠిన చర్యలు తీసుకోవాలని, బాధితులకు న్యాయం చేయాలని కొరారు. ఒక మారుమూల తండా నుంచి అంతర్జాతీయ స్థాయికి పేరు ప్రాముఖ్యతలు పొందిన మంగ్లీ పై నిరాదనమైన ఆరోపణలు చేస్తున్నారని ఇలాంటి వెంటనే మానుకోవాలి హెచ్చరించారు .