30 March, 2026 | 1:29 PM

Breaking News

మోకిలాలో డ్రగ్ రాకెట్ భగ్నం— నిందితుల్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్   •   నటుడు ప్రకాశ్ రాజ్ ఇంట తీవ్ర విషాదం.. ఆయన తల్లి కన్నుమూత   •   శాసనమండలి నుంచి బీఆర్‌ఎస్‌ సభ్యుల సస్పెన్షన్   •   అపార్ట్‌మెంట్‌లో అగ్నిప్రమాదం.. సురక్షితంగా బయటపడిన 16 కుటుంబాలు   •   మాజీ ఎమ్మెల్యే మర్రి అభిమానులపై కేసు నమోదు   •   మైనింగ్‌పై దద్దరిల్లిన శాసనసభ బీఆర్‌ఎస్ సభ్యుల సస్పెన్షన్   •   మీ తాతలు దిగొచ్చినా పొంగులేటి రాజీనామా చేయరు   •   కన్నోళ్లకు భరోసా   •   ఆంధ్రోళ్ల చేతికి ఆర్టీసీ!   •   పశ్చిమాసియాలో భూతల యుద్ధం దగ్గరపడింది: అమెరికా 7,000 సైనికులు మోహరింపు, ఇరాన్ 10 లక్షల సైన్యం సిద్ధం   •  

ప్రతి ఒక్కరూ సేవా భావాన్ని అలవర్చుకోవాలి

01-12-2025 12:19 AM

ఎమ్మెల్యే ముఠా గోపాల్

ముషీరాబాద్, నవంబర్ 30 (విజయక్రాంతి): ప్రతి ఒక్కరూ సేవా భావాన్ని అల వర్చుకోవాలని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ఈ మేరకు ఆదివా రం ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని అమ్మవారి దేవాలయం వద్ద  మదర్ ల్యాండ్ వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ సొసైటీ, ఓల్ ఏజ్ హోమ్ ఫర్ ఆర్పన్స్  చైర్మన్ ఆలీ ఆధ్వర్యంలో  పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే ముఠా గోపాల్ మాట్లాడుతూ పేదలకు అన్నదానం చేయడం అభినందనీయమన్నారు.

ప్రతి నెల చివరి రోజు అన్నదానం కార్యక్ర మం చేపట్టి పేదలకు అండగా నిలుస్తున్న సొసైటీ చైర్మన్ ఆలీని ఈ సందర్భంగా ఆయన అభినందించారు. అనంతరం సొసైటీ చైర్మన్ ఆలీ ఎమ్మెల్యేను శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ముషీరాబాద్ బీఆర్‌ఎస్ మీడియా ఇన్ఛార్జి ముచ్చకుర్తి ప్రభాకర్, సొసైటీ ప్రతినిధులు వై.  మల్లేష్, వెంకటేష్ కే. శ్రీనివాస్, బాలయ్య యాదవ్, ఎస్.కె రషీద్, సంతు తదితరులు పాల్గొన్నారు.