2 July, 2026 | 11:53 AM

Breaking News

తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత, హరీశ్ రావు, బీఆర్ఎస్ నేతలు అరెస్ట్   •   ఎమ్మెల్యే హైదరాబాద్‌లో కాదు... నియోజకవర్గంలో ఉండాలి: బొల్లం   •   అధికార పార్టీ నేత కిరాతకం.. వితంతు మహిళపై అత్యాచారం   •   డీఎస్పీ భీమ్ రెడ్డి ఇంట్లో ఏసీబీ సోదాలు   •   సవాళ్లు, ప్రతిసవాళ్లు.. చర్చకు సిద్ధమైన మంత్రులు   •   భారీ వర్షానికి పశు వైద్య కార్యాలయ ప్రాంగణం జలమయం   •   డీ- అడిక్షన్ సెంటర్‌లో జిమ్ ట్రైనర్ ఆత్మహత్య   •   కరస్‌గుత్తిలో భూ రీ-సర్వే, సర్-2026 పనులను పరిశీలించిన డిప్యూటీ కలెక్టర్   •   ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్య సేవలు అందించాలి- జిల్లా కలెక్టర్   •   ఆటో బోల్తాపడి 10 మందికి తీవ్రగాయాలు   •  

వడ్డెర కాలనీ సమస్యల పరిష్కారానికి కృషి

02-07-2026 12:00 AM

ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి 

పటాన్చెరు, జూలై 1 : ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని చిట్కుల్ వడ్డెర కాలనీలో నెలకొన్న సమస్యలను అతి త్వరలో పరిష్కరించడం జరుగుతుందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ కాలనీ ప్రజలకు హామీ ఇచ్చారు. బుధవారం స్థానిక మున్సిపల్ చైర్మన్ సుమలత, కమిషనర్ వెంకట కిషన్, మాజీ ఎంపీపీ శ్రీశైలం యాదవ్, మాజీ జెడ్పిటిసి శ్రీకాంత్ గౌడ్, కౌన్సిలర్లతో కలిసి కాలనీలో పర్యటించారు.

కాలనీ ప్రజలతో సమావేశమై వారు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్నారు. ప్రధానంగా సిసి రోడ్లు, అంతర్గత మురుగునీటి కాలువలు, ఇంటి నంబర్ల అంశంలో ఇబ్బందులు ఎదుర్కొంటామని వారు ఎమ్మెల్యే జిఎంఆర్ దృష్టికి తీసుకెళ్లారు. మున్సిపల్ తరఫున ప్రత్యేక నిధులు కేటాయించి అతి త్వరలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తామని తెలిపారు. కాలనీలో అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తున్నామని తెలిపారు.

కాలనీలో నూతనంగా నిర్మించిన మునీశ్వర ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆరవ వార్డు పరిధిలోని ఎస్వి హోమ్స్ కాలనీలో మిషన్ భగీరథ పైప్లైన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు, కౌన్సిలర్ పాండు, నరేందర్ రెడ్డి, కౌన్సిలర్లు ఆంజనేయులు, వెంకటేష్, కిషోర్ రెడ్డి, రాహుల్ రెడ్డి, గద్దె రాజు, నవీన్ రెడ్డి, లత, కో ఆప్షన్ సభ్యులు విష్ణువర్ధన్ రెడ్డి, బాబా, బండ రాజు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.