డాక్టర్ ఏవి గిరిసింహా రావు కరీంనగర్ నుండి ఖమ్మం బదిలీ
ముకరంపుర,(విజయక్రాంతి): కరీంనగర్ ఆర్టీసీ జోనల్ హాస్పిటల్ సీనియర్ మెడికల్ ఆఫీసర్ డా.ఎవి గిరిసింహా రావు ఖమ్మం ఆర్టీసీ ఆసుపత్రి కి బదిలీ అయ్యారు. కరీంనగర్ లో పనిచేసిన అనతి కాలంలో జోనల్ హాస్పిటల్ అభివృద్ధికి మౌలిక వసతుల కల్పనకు ఎంతో కృషి చేశారు. మానిటర్స్,డిజిటల్ మొబైల్ ఎక్స్ రే, స్కానింగ్,ఎమర్జెన్సీ కేర్ యూనిట్, డే కేర్ లాబ్ సిబ్బంది నియామకం,అప్రోచ్ రోడ్, ప్లాంటేషన్,బాక్ గేట్,సైన్ బోర్డ్ తదితర హంగులతో హాస్పిటల్ రూపురేఖలు మార్చారు. ముందు గార్డెన్ లో ఏర్పాటు చేసిన సిమెంట్ బెంచీ ల పై రిటైర్డ్ ఉద్యోగులు సేద తీరే విధంగా తీర్చిదిద్దారు. బదిలీపై వెళ్తున్న డాక్టర్ గిరిసింహారావు మాట్లాడుతూ దాదాపు 18 నెలల కాలం కరీంనగర్ జోనల్ హాస్పిటల్లో విధులు నిర్వహించడం ఉన్నతాధికారుల పర్యవేక్షణలో ఆసుపత్రిని ఉన్నతీకరించే అవకాశం దొరకడం అదృష్టంగా భావిస్తున్నాను అన్నారు.






