25 April, 2026 | 5:25 PM

Breaking News

గురుకులాల ప్రగతిలో గురువుల పాత్ర అమోఘం   •   బాల్య వివాహాలు అరికట్టడం అందరి బాధ్యత   •   దోమల నివారణతోనే మలేరియాకు అడ్డుకట్ట   •   శ్రీ పోతులూరి బ్రహ్మంగారి ఉత్సవాలకు హాజరైన మంత్రి దామోదర్ రాజనర్సింహ   •   ఓటరు మ్యాపింగ్ పకడ్బందీగా నిర్వహించాలి   •   కల్వకుర్తి నియోజకవర్గంలో 'ప్రజా దర్బార్' ఏర్పాటు చేయాలి: కేఎన్ఆర్ సేవాదళం విజ్ఞప్తి   •   చిన్నారులకు సాంప్రదాయ నృత్యంలో ఉచిత శిక్షణ   •   విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలి: కట్టం మల్లేష్ గౌడ్   •   అనురాగ్ యూనివర్సిటీలో 'SEATNGA-2026' అంతర్జాతీయ కాన్ఫరెన్స్ ప్రారంభం   •   మంత్రి పొంగులేటి సమక్షంలో ఘనంగా సర్పంచ్ వెంకట్ జన్మదిన వేడుకలు   •  

వరదరాజస్వామి ఆలయ అభివృద్ధికి విరాళం

07-10-2025 12:23 AM

కీసర , అక్టోబర్ 6 ( విజయక్రాంతి): నాగారం మున్సిపాలిటీకి చెందిన అక్కల సురేష్ కుమార్, ఆధ్యాత్మికతపై తన అచంచలమైన భక్తిని చాటుకుంటూ, వరదరాజపురంలోని ప్రసిద్ధ శ్రీశ్రీశ్రీ బూనీలా సమేత వరదరాజస్వామి దేవస్థాన ఆలయ అభివృద్ధి పనుల కోసం తన వంతుగా లక్షా రెండు వేల రూపాయలు (1,02,000)విరాళాన్ని  ఆలయ చైర్మన్ ప్రొద్దుటూరి గోపాల కృష్ణకు అందించారు.

సుమారు 600 సంవత్సరాల పురాతన చరిత్ర కలిగిన ఈ వరదరాజస్వామి దేవస్థానం అనేక దశాబ్దాలుగా భక్తుల కోరికలు తీరుస్తూ, విశేష పుణ్యక్షేత్రంగా అభివృద్ధి చెందుతోంది. ఈ నేపథ్యంలో, ఆలయ అభివృద్ధి పనుల్లో భాగస్వామ్యం కావాలని సురేష్ కుమార్ నిర్ణయించుకున్నారు. విరాళం అందించిన అనంతరం అక్కల సురేష్ కుమార్ మాట్లాడుతూ, ‘మన దేవాలయాలను, సనాతన ధర్మాన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత.

ప్రతి ఒక్కరూ ఆలయ అభివృద్ధి పనుల గురించి సహకరించాలని భక్తులకు పిలుపునిచ్చారు. ఆయన దాతృత్వాన్ని ఆలయ చైర్మన్ ప్రొద్దుటూరి గోపాల కృష్ణతోపాటు ఆలయ కమిటీ సభ్యు లు, భక్తులు అభినందించారు.వరదరాజస్వామి అనుగ్రహంతో ఈ ఆలయం మరింతగా అభివృద్ధి చెంది, భక్తుల కోరికలు తీర్చే దివ్యక్షేత్రంగా విరాజిల్లుతుందని  ఆశాభావం వ్యక్తం చేశారు.