27 June, 2026 | 2:26 PM

ఇల్లందు గ్రంథాలయాన్ని తనిఖీ చేసిన జిల్లా కార్యదర్శి

27-06-2026 01:29 PM

ఇల్లందు టౌన్, జూన్ 27 (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి కే. కరుణకుమారి శనివారం ఇల్లందు శాఖా గ్రంథాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గ్రంథాలయంలో నిర్వహిస్తున్న రికార్డులు, పుస్తకాల నిర్వహణ, పాఠకులకు అందిస్తున్న సేవలు, కార్యాలయ నిర్వహణ తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. గ్రంథాలయ నిర్వహణ సక్రమంగా ఉండటంతో పాటు సిబ్బంది పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేసి, ఇదే విధంగా సేవలను కొనసాగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ సిబ్బంది డి. రుక్మిణి పాల్గొన్నారు.