కార్యకర్త కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన జిల్లా అధ్యక్షురాలు పద్మ దేవేందర్ రెడ్డి
చేగుంట,(విజయక్రాంతి): నార్సింగి మండలం జప్తి శివనూర్ నూర్ గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ కార్యకర్త ఎండి మున్వర్ ఇటీవల ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో మరణించడం జరిగింది. ఇట్టి విషయం తెలుసుకున్న మెదక్ జిల్లా బిఅర్ఎస్ పార్టీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి వారి కుటుంబ సభ్యులను ఓదార్చి, వారికీ ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో నార్సింగి మండలం తాజా మాజీ జడ్పిటిసి బాణాపురం కృష్ణారెడ్డి, శంకరంపేట మాజీ జెడ్పిటిసి పట్లోళ్ల మాధవి రాజు, నార్సింగి సర్పంచ్ ఆకుల మల్లేశం గౌడ్, జప్తి శివనూర్ సర్పంచ్ కాబోజి బాల నరసింహులు, మాజీ వైస్ ఎంపీపీ సుజాత శంకర్, ఉప సర్పంచ్ గంగమైన రాములు, షేర్ పల్లి గ్రామ సర్పంచ్ గోండ స్వామి, పార్టీ కార్యకర్తలు మాజీ సర్పంచులు వార్డ్ నెంబర్లు తదితరులు పాల్గొన్నారు.






