4 July, 2026 | 11:34 PM

Breaking News

అనురాగ్ వార్షిక స్నాతకోత్సవంలో 2,789 మంది విద్యార్థులకు పట్టాలు ప్రదానం   •   హ్యూమన్‌ రైట్స్‌ ఫౌండేషన్‌ రాష్ట్ర కోఆర్డినేటర్ గా సాయి భాను   •   డ్రగ్స్, సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన   •   వేములవాడ నాయీ బ్రాహ్మణ అసోసియేషన్‌ నూతన కమిటీ   •   పేరం వెంకటేశ్వర రావుకి ఘన సన్మానం   •   నీటి సంపులో పడి చిన్నారి మృతి   •   సీఐ కరుణాకర్ కు జన్మదిన శుభాకాంక్షలు   •   కొత్త మోడల్ మార్కెట్‌లో మహిళా వ్యాపారుల కన్నీరు   •   దొడ్డి కొమరయ్య త్యాగం అందరికీ స్ఫూర్తిదాయకం   •   లయన్స్ క్లబ్ నేరేడుచర్ల ఆధ్వర్యంలో పింగళి వెంకయ్య వర్ధంతి, అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు   •  

ముగిసిన జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు

02-10-2025 12:53 AM

జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి),అక్టోబర్ 1: గత మూడు రోజులుగా సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం గ్రామంలో మండల, గ్రామ యూత్ కాంగ్రెస్‌ల ఆధ్వర్యంలో నిర్వహించిన ఉమ్మడి నల్లగొండ జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు బుధవారం ముగిశాయి. హోరాహోరీగా సాగిన కబడ్డీ పోటీలలో మొదటి బహుమతి నూతనకల్, 2వ బహుమతి కోదాడ, 3వ బహుమతి హుజూర్నగర్, 4వ బహుమతి జాజిరెడ్డిగూడెం, 5వ బహుమతిని మోతె జట్టు కైవసం చేసుకున్నాయి.

గెలుపొందిన జట్లకు బహుమతుల ప్రధాత, డీసీసీ ఉపాధ్యక్షులు దరూరి యోగానంద చార్యుల ఆదేశానుసారం ఆయా జట్లకు నగదుతో పాటు షీల్ లను ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు నర్సింగ శ్రీనివాస్ గౌడ్,మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శిగ నసీర్ గౌడ్,కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు నర్సింగ కృష్ణమూర్తి, వల్లాల ఖాజా, బింగి కృష్ణమూర్తి, మామిడి అనిల్, రాజ్ కుమార్, జెర్రిపోతుల రాంబాబు, విజయ్, సందీప్ పాల్గొన్నారు.