4 April, 2026 | 1:28 PM

నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా ఎన్నికల పరిశీలకులు రవి నాయక్

30-11-2025 08:10 PM

మోతె (విజయక్రాంతి): ఆదివారం మండల పరిధిలోని మామిళ్ళ గూడెం, మోతె నామినేషన్  సెంటర్లను జిల్లా ఎన్నికల పరిశీలకులు రవి నాయక్ పరిశీంచారు. అనంతరం మండల అధికారులకు పలు సూచనలు చేశారు. రేపు ఎల్లుండి రెండు రోజుల పాటు నామినేషన్లు పెరిగే అవకాశం ఉండటం వలన సెంటర్లలో సౌకర్యం కల్పంచాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల ఎన్నికల అధికారి టి. ఆంజనేయులు, తహసీల్దార్ యం. వెంకన్న, ఆయా గ్రామాల కార్యదర్శి లు సంపత్, రేణుక, మౌనిక, ఎన్నికల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.