తాడువాయిలో జీలుగ విత్తనాల పంపిణీ
23-05-2026 06:08 PM
తాడ్వాయి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలంలో శనివారం వ్యవసాయ శాఖ అధికారులు జీలుగ విత్తనాలను పంపిణీ చేశారు. ప్రభుత్వం రాయితీపై అందించే ఈ విత్తనాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. తాడ్వాయి సింగిల్ విండోకు 410 బస్తాలు, దేమి కలాన్ సింగిల్ విండోకు 250 బస్తాలు వచ్చినట్లు తెలిపారు. ఈ విత్తనాలు వేసుకున్నటలయితే పచ్చిరొట్ట ఎరువుగా మంచి ఉపయోగం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఈవోలు శివ చైతన్య గౌడ్, దేమికలాన్ సింగిల్ విండో వైస్ చైర్మన్ రవీందర్ రెడ్డి, రైతులు పాల్గొన్నారు.






