8 April, 2026 | 2:42 AM

సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ

08-04-2026 12:48 AM

నిజాంసాగర్ ఏప్రిల్ 7 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలోని పెద్ద ఆరేపల్లి గ్రామానికి చెందిన వేముల విట్టల్, బంజపల్లి గ్రామానికి చెందిన సమీర్కు ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్) ద్వారా మంజూరైన చెక్కులను కామారెడ్డి జిల్లా డిసిసి అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ మంగళవారం రోజు అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆపదలో ఉన్న ప్రజలకు ప్రభుత్వం అండగా నిలుస్తూ సీఎంఆర్‌ఎఫ్ ద్వారా సహాయం అందించడం ఎంతో ఉపయుక్తమని పేర్కొన్నారు. ప్రజలు ఇలాంటి పథకాలను వినియోగించుకుని తమ సమస్యలను అధిగమించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ప్రజాపండరి, జనార్దన్ రెడ్డి, సంకు లక్ష్మయ్య, శ్రీనివాస్, మండలంలోని సర్పంచులు, ఉపసర్పంచులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.