దక్షిణాదిపై దృష్టి పెట్టిన డిష్ టీవీ
హైదరాబాద్, మే 19: దేశంలో అత్యంత చురుకైన సాంస్కృతిక వైవిధ్యంతో కూడిన వినోద మార్కెట్లలో ఒకటిగా చెప్పుకునే దక్షిణాదిపై డిష్ టీవీ ఇండియా లిమిటెడ్ ఫోకస్ పెట్టింది. ప్రాంతీయ భాషా అభిరుచులు, సరసమైన వినోదం, మరియు రోజువారీ అంతరాయం లేని వీక్షణ అనుభవాన్ని కేంద్రంగా చేసుకుని ప్రత్యేకంగా రూపొందించిన కొత్త సౌత్ ఇండియా ఆఫర్ను ప్రకటించింది. మారుతున్న వినియోగదారుల వీక్షణ అలవాట్లను దృష్టిలో ఉంచుకుని రూపొందించిన ఈ కొత్త ఆఫర్లో నెలకు కేవలం రూ.149 నుంచి ప్రారంభమయ్యే ప్రాంతీయ భాషా ప్యాకేజీలు అందుబాటులోకి తీసుకువచ్చారు.
ఇందులో వినోదం, సినిమాలు, ప్రాంతీయ కార్యక్రమాలు, మరియు క్రీడా కంటెంట్ ప్రత్యేకంగా అందుబాటులో ఉంచింది. ఈ మారుతున్న వినియోగదారుల అభిరుచులను దృష్టిలో ఉంచుకుని, డిష్ టీవీ తన మెరుగైన ఆఫర్ను సంబంధిత కంటెంట్ను మరింత సులభంగా అందుబాటులోకి తీసుకురావడంతో పాటు, వినియోగదారులకు మెరుగైన సౌకర్యం, నిరంతర సేవలు మరియు అధిక విలువను అందించేలా రూపొందించింది. నెలకు కేవలం రూ.149 నుంచి ప్రారంభమయ్యే ఈ ఎంట్రీ ప్యాక్లో వినోదం మరియు క్రీడలకు సంబంధించిన విభిన్న ఛానళ్ల సమ్మేళనం అందుబాటులో ఉంటుంది.
బేస్ ఆఫర్లో మొత్తం 225కి పైగా ఛానళ్లు ఉండగా, తెలుగు, కన్నడ, మలయాళ భాషా ప్యాకేజీల్లో ఒక్కోటి 30కి పైగా ఛానళ్లు, అలాగే తమిళ ప్రేక్షకుల కోసం 36కి పైగా తమిళ భాషా ఛానళ్లు రోజువారీ కుటుంబ వీక్షణ అవసరాలకు అనుగుణంగా అందించబడుతున్నాయి. ఈ మెరుగైన సేవలో భాగంగా, డిష్ టీవీ తన ‘స్పోర్ట్స్ ఆల్వేస్-ఆన్’ ఫీచర్ను కూడా ప్రవేశపెట్టింది. దీని ద్వారా రీచార్జ్ గ్యాప్లు లేదా తాత్కాలిక సేవ అంతరాయాలు ఉన్నప్పటికీ, వీక్షకులు ముఖ్యమైన క్రీడా కార్యక్రమాలను వీక్షించే అవకాశాన్ని కోల్పోకుండా ఉండగలరు.
ఈ సందర్భంగా డిష్ టీవీ ఇండియా లిమిటెడ్ సీఈఓ మరియు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మనోజ్ దోభాల్ మాట్లాడుతూ,"దక్షిణ భారతదేశం డిష్ టీవీకి ఎప్పటినుంచో అత్యంత కీలకమైన మార్కెట్ గా ఉదన్నారు. నెలకు రూ.149 నుంచి ప్రారంభమయ్యే మా కొత్త ప్యాకేజీలతో నాణ్యమైన వినోదాన్ని మరింత అందుబాటులోకి తీసుకురావడమే తమ లక్ష్యమన్నారు. డిష్ టీవీ ఇండియా లిమిటెడ్ చీఫ్ రెవెన్యూ ఆఫీసర్ సుఖ్ప్రీత్ సింగ్ మాట్లాడుతూ, ప్రస్తుత వినియోగదారులు విలువ, సౌలభ్యం మరియు తమ భాషా అభిరుచులకు అనుగుణమైన వినోద అనుభవాలను కోరుకుంటున్నారనీ, అలాంటి వారి కోసమే కొత్త దక్షిణ భారత ఆఫర్ రూపొందించినట్టు తెలిపారు.






