పార్కిన్సన్స్ నియంత్రణలో డీబీఎస్ కీలక చికిత్స
మెడికవర్ వైద్యులు
సికిందరాబాద్, మే 21 (విజయక్రాంతి): భారతదేశంలో వేగంగా పెరుగుతున్న న్యూరోలాజికల్ వ్యాధుల్లో పార్కిన్సన్స్ వ్యాధి ఒ కటిగా మారుతోందని మెడికవర్ హాస్పిట ల్స్, సికింద్రాబాద్ న్యూరో సైన్సెస్ నిపుణు లు తెలిపారు. ముఖ్యంగా 60ఏళ్లు పైబడిన వారిలో ఈ వ్యాధి అధికంగా కనిపిస్తోందని, ఆలస్యంగా గుర్తించడం వల్ల రోగులు క్రమంగా స్వతంత్ర జీవనాన్ని కోల్పోతున్నారని వైద్యులు హెచ్చరించారు.
మెదడులో డోపమై న్ ఉత్పత్తి చేసే కణాలు క్రమంగా దెబ్బతినడం వల్ల ఈ వ్యాధి వస్తుందని నిపుణులు వివరించారు.చేతులు వణకడం, కాళ్లు గట్టిపడటం, నడకలో అస్థిరత, శరీర కదలికలు మందగించడం, తరచూ పడిపోవడం, మా ట్లాడడంలో, రోజువారీ పనుల్లో ఇబ్బందులు వంటి లక్షణాలు కనిపిస్తాయని తెలి పారు. వ్యాధి ముదిరే కొద్దీ రోగులు పూర్తిగా ఇతరులపై ఆధారపడే పరిస్థితి ఏర్పడుతుందని పేర్కొన్నారు.
ప్రారంభ దశల్లో మందు లతో లక్షణాలను నియంత్రించవచ్చని, అ యితే అడ్వానస్డ్ దశలో డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్(డీబీఎస్) వంటి ఆధునిక చికిత్సలు రోగులకు గణనీయమైన ఉపశమనాన్ని అం దిస్తాయని తెలిపారు. మెడికవర్ హాస్పిటల్స్ న్యూరో సర్జన్ డాక్టర్ శ్రీనివాస్ దూసా మాట్లాడుతూ, డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ పార్కిన్సన్స్కు పూర్తి నివారణ కాకపోయినా, సరైన రోగుల్లో వణుకు, కండరాల గట్టితనం, కదలికల సమస్యలను గణనీయంగా తగ్గిస్తుంది. దీని వల్ల రోగులు మళ్లీ సాధారణ జీవితానికి చేరుకునే అవకాశం ఉంటుంది అని తెలిపారు.
ఇటీవల ఖమ్మం జిల్లాకి చెందిన 63 ఏళ్ల శ్రీ రాకేష్కు మెడికవర్ హాస్పిటల్స్లో విజయవంతంగా డీబీఎస్ శస్త్రచికిత్స నిర్వహించి నట్లు వైద్యులు తెలిపారు. శస్త్రచికిత్స అనంత రం ఆయన కదలికలు, నడక, శారీరక స్థిరత్వంలో స్పష్టమైన మెరుగుదల కనిపించిందన్నారు. ఈ క్లిష్టమైన చికిత్సను డాక్టర్ శ్రీనివాస్ దూసా, డాక్టర్ రమేష్ శిఖాకొల్లి, డాక్టర్ రోహిత్ రమేష్, డాక్టర్ వికాస్ అగర్వా ల్, డాక్టర్ సుధీర్లతో కూడిన మల్టీడి సిప్లినరీ న్యూరో సైన్సెస్ బృందం విజయవంతంగా నిర్వహించింది.
న్యూరో అనస్థీషియా, ఫిజియోథెరపీ, రిహాబిలిటేషన్, క్రిటికల్ కేర్, నర్సింగ్ బృందాలు కీలక పాత్ర పోషించా యి. పార్కిన్సన్స్ వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తించడం, క్ర మం తప్పకుండా వైద్య పర్యవేక్షణలో ఉండటం, ఫిజియోథెరపీ, ఆరోగ్య కరమైన జీవనశైలిని పాటించడం ద్వారా రో గులు ఎక్కువకాలం చురుకుగా జీవించవచ్చని మెడికవర్ నిపుణులు సూచించారు.






