హిందువులపై ఉద్దేశపూర్వకంగా దాడులు
బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుతో కలిసి డిజిపి శ్రీవర్రెడ్డిని కలిసిన జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి
నిజామాబాద్ ఫిబ్రవరి 25 (విజయక్రాంతి): హిందువులపై కొందరు దుండగులు ఉద్దేశపూర్వకంగా దాడులకు పాల్పడుతున్నారని నిజామాబాద్ జిల్లా బిజెపి అధ్యక్షుడు దినేష్ కులచారీ ఆరోపించారు. జిల్లాలోని రుద్రూర్ బాన్సువాడ నిజామాబాద్లో హిందువులపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి కోరారు. హైదరాబాద్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామ చందర్రావుతో కలిసి డీజీపీ శివధర్ రెడ్డికి వినతిపత్రం స్థానిక పోలీసులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదన్నారు.
బాధితులు స్థానిక పోలీసు అధికారులకు పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీని వారు ప్రాథమికంగా కూడా స్పందించడం లేదని పక్షపాత ధోరణితో బాధ్యతా రహిత్యంగా వ్యవహరిస్తున్నారరని డి జి పి కి ఇచ్చిన వినతి పత్రంలో పేర్కొన్నారు. భవిష్యత్తులో దాడులు జరగకుండా ఉండాలంటే స్థానిక పోలీసులు కఠినంగా వ్యవహరించాలని, ఇకనైనా నిందితులను అరెస్టు చేసి వారిపై పరమైన కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. దాడులు జరుగుతున్న సున్నితమైన ప్రాంతాల్లో తక్షణమే పోలీసు బలగాలని మోహరించి భవిష్యత్తులో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా హిందువులకు భద్రత కల్పించాలన్నారు.




