9 May, 2026 | 5:34 PM

Breaking News

వెంకటేశ్వర స్వామి ఆలయంలో రక్షణ ఏర్పాట్లు   •   అక్రమంగా ఎద్దులను తరలిస్తున్న కంటైనర్ వాహనాన్ని పట్టుకున్న పోలీసులు   •   పాత బిల్లుల పేరిట కొత్త పాలకవర్గంపై ఒత్తిడి?   •   కాకతీయ కళల జాతర సాంస్కృతిక పోటీలు ప్రారంభం   •   పేదల మెరుగైన జీవితం కోసం కృషి చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం   •   తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడేది బిజెపి ప్రభుత్వమే   •   కాంగ్రెస్ రాజ్యసభ సభ్యులను కలిసిన ఎర్ర విజయ్ రావు   •   సుల్తానాబాద్ లో జాతీయ పక్షి నెమలి మృతి   •   ధాన్యం కొనాలని ఇందారంలో రైతుల రాస్తారోకో   •   సత్తుపల్లి నియోజకవర్గ ప్రజలకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్సీ తాతా మధు, మాజీ ఎమ్మెల్యే సండ్ర   •  

భీమిరెడ్డి నరసింహారెడ్డి 18వ వర్ధంతి

09-05-2026 04:12 PM

సూర్యాపేట జిల్లాకు 'బీఎన్' పేరు పెట్టాలని డిమాండ్

​తుంగతుర్తి,(విజయక్రాంతి): ప్రఖ్యాత తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధులు, మాజీ పార్లమెంటు సభ్యులు స్వర్గీయ భీమిరెడ్డి నరసింహారెడ్డి  18వ వర్ధంతి వేడుకలు ఆయన స్వగ్రామమైన తుంగతుర్తి మండలం కరివిరాల కొత్తగూడెంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ఆయన విగ్రహానికి మరియు స్మృతి స్తూపానికి పూలమాలలు వేసి గ్రామస్తులు, ప్రముఖులు ఘన నివాళులర్పించారు. 

ఆయన ​ఆశయ సాధన ఈ కార్యక్రమంలో పాల్గొన్న మల్లు కపోతం రెడ్డి, తుంగతుర్తిలో మాజీ ఎంపీపీ తాటికొండ సీతయ్య మాట్లాడుతూ.. బీఎన్  చూపిన బాటలో నడవడమే ఆయనకు మనం ఇచ్చే నిజమైన నివాళి అని, ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.​ బీఎన్  కీర్తిని, ఆయన చేసిన పోరాటాలను భావితరాలకు స్ఫూర్తిగా నిలిపేందుకు, నూతనంగా ఏర్పాటైన సూర్యాపేట జిల్లాకు 'భీమిరెడ్డి నరసింహారెడ్డి' పేరు పెట్టాలని ఈ సందర్భంగా వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.